మహబూబ్నగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పీహెచ్సీలో ప్రధాని మోదీ బొమ్మ ఎందుకు పెట్టలేదంటూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే హంగామా చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన పాతపాలమూరు పీహెచ్సీని తనిఖీ చేశారు. మోదీ బొమ్మ ఏదీ అంటూ హంగామా చేశారు. ఫొటోలు, ఫ్లెక్సీలపై తెలంగాణ సీఎం, మంత్రుల ఫొటోలు ఉన్నాయని, ప్రధాని ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. అయితే కేంద్ర మంత్రి వస్తున్నారని తెలిసి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తెలంగాణ సీఎం బొమ్మ ఏదని మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు నిలదీశారు.