వరంగల్ : రాష్ట్రంలో పత్తి రైతుల పంట పండుతున్నది. పత్తి ధర పరుగులు పెడుతుండటంతో తెల్ల బంగారానికి కాసుల వర్షం కురుస్తున్నది. రికార్డు స్థాయిలో ధర పలుకుతుండటంతో అన్నదాతల ముఖాల్లో చిరు నవ్వులు పూస్తున్నాయి. బుధవారం ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి రూ.9,000 పలికిందని అధికారులు తెలిపారు.
అలాగే వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.8,800 పలికింది. ఈ సీజన్లో ఇదే రికార్డు ధర అని అధికారులు చెప్పారు.