నాగర్కర్నూల్, జూలై 14 (నమస్తే తెలంగాణ): గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మరణం తీరని లోటని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయిగార్డెన్లో సాయిచంద్ సంతాపసభ నిర్వహించారు. సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విప్ గువ్వల, ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ.. సాయిచంద్ సేవలను కొనియాడారు. సాయిచంద్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రకటించారు. సాయిచంద్ కూతురు పేరిట రూ.21 లక్షలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కవి, గాయకుడు సురేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బైకాని శ్రీనివాస్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.