ఏర్గట్ల, అక్టోబర్ 2/భీమ్గల్/వర్ని/సిద్దిపేట/డిచ్పల్లి/జక్రాన్పల్లి: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్కు చెం దిన బీఆర్ఎస్ నాయకుడు కృష్ణ కూతురు కృతిక తన కిడ్డీ బ్యాంకులో రూ.3,840 డబ్బు దాచుకున్నది. సోమవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏర్గట్ల మండలంలో పర్యటిస్తుండగా అక్కడికి చేరుకున్న చిన్నారి ఆ మొత్తాన్ని మంత్రికి అందజేసింది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరా విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన 36 కుటుంబాలు, గౌడ సంఘానికి చెందిన 40, ము చ్కూర్ రజక సంఘానికి చెందిన 65 కుటుంబాలు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్ద తుగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని వడ్డెర, ముదిరాజ్, ఆర్యవైశ్య సంఘం, గౌడ, విశ్వ బ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, మున్నూరు కాపు కులస్థులతోపాటు జలాల్పూర్కు చెందిన గూండ్ల కులస్థులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్ద తుగా ఏకగ్రీవ తీర్మానాలను అందజేశారు. సిద్దిపేట పట్టణంలోని రాజీవ్ రహదారి పకన 7.05 కోట్లతో నిర్మించిన వైశ్య సంక్షేమ సమితి కన్వెన్షన్ హాల్ను సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్యులు మంత్రికి మద్దతిస్తా మని ఏకగ్రీవంగా ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శాలివాహన కుమ్మరి సంఘం సభ్యులు, జక్రాన్పల్లి మండ లం చింతలూర్లోని గంగపుత్ర సంఘానికి చెందిన 23 కుటుంబాలు ఎమ్మెల్యే బాజిరెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.