గొల్లపల్లి, మే 14 : హార్వెస్టర్తో తండ్రి పొలం కోస్తుండగా ప్రమాదవశాత్తు కొడుకు అందులో ఇరుక్కొని ప్రా ణాలు వదిలాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్లో ఆదివారం చోటుచేసుకున్నది. అబ్బాపూర్కు చెందిన చెవుల ప్రభాకర్ కుమారుడు రంజిత్ (17) తెలంగాణ మోడల్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేశాడు. పరీక్షలు అయిపోవడంతో తండ్రికి వ్యవసాయ పనుల్లో ఆసరా అవుతున్నాడు.
పొలం కోసేందుకు ఆదివారం ఉదయాన్నే తండ్రీకొడుకులు పొలానికి వెళ్లారు. పొలం కోస్తున్న క్రమంలో హార్వెస్టర్ ముందు గల బ్లేడ్లో ఇరుక్కున్న మట్టిని తొలగించాలని ప్రభాకర్ కొడుకు రంజిత్కు చెప్పాడు. అతడు మట్టి ని శుభ్రం చేస్తున్న క్రమంలో అనుకోకుండా బ్లేడ్ను రన్ చేయడంతో రంజిత్ అందులో ఇరుకుపోయాడు. తలకు తీవ్ర గాయమై కొన ఊపిరితో ఉన్న రంజిత్ను చికిత్స కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.