హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): దేశం పేరును చేర్చేది? మార్చేది ఏమిటని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. దేశం మార్పుపై చర్చే అర్థరహితమని మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం ‘ఇండియా దట్ ఈజ్ భారత్, షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని స్పష్టం చేసిన విషయాన్ని ఉదహరించారు. ఇండియాను భారతదేశమని పిలుచుకోవటం, రాసుకోవటం సర్వసాధారణ విషయమన్నారు.