హైదరాబాద్: బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జేపీ నడ్డా చెప్పులు మోసే గులామ్ ఎవరు అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ ప్రశ్నవేశారు. దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని కచ్చితంగా చెబుతున్నానని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Pop quiz:
Which Ghulam will carry the Chappal of JP Nadda today?
Am sure there is intense competition 😁 pic.twitter.com/Tz8YiCYIiS
— KTR (@KTRTRS) August 27, 2022
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన అమిత్ షా కు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు అందించిన విషయం తెలిసిందే. మరి నేడు జేపీ నడ్డాకు చెప్పులు మోసేదెవరంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.