కామారెడ్డి : మానవత్వం పరిమళించింది. కరోనాతో మరణించిన ఓ వ్యక్తి అంత్య క్రియలను కుల, మతాలకు అతీతంగా నిర్వహించి ముస్లిం యువకులు మానవత్వపు పరిమళాలను వెదజల్లారు. కామారెడ్డి పట్టణం 29వ వార్డులోని గొల్లవాడలో కరోనా బారిన పడి గుండెపోటు రావడంతో గురువారం బెస్త ఎల్లయ్య (65) అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే దహన సంస్కారాలు చేయడానికి కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు లేదు.
దీంతో స్థానిక కౌన్సిలర్ భర్త టీఆర్ఎస్ నాయకుడు అంజద్ తన స్నేహితులు జాఫర్, నరేష్, అమర్,జిషాప్, అసిఫ్ సహాయంతో ఎల్లయ్య దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. మతాలకు అతీతంగా ముస్లిం యువకులు ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించడంతో కాలనీ వాసులు వారిని అభినందించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పరీక్షల కోసం వచ్చి.. కన్నుమూశాడు
సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడు : మంత్రి కొప్పుల
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?