యాదగిరిగుట్ట,యాదాద్రి భువనగిరి : శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్ట శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఒక్కరోజే ఆలయానికి రూ. 39,56,427 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.5,21,650,కైంకర్యములు ద్వారా రూ. 2,200, సుప్రభాతం ద్వారా రూ. 6,300,బ్రేక్ దర్శనం ద్వారా ద్వారా రూ.2,99,700 ఆదాయం సమకూరిందని తెలిపారు.
వ్రతాల నిర్వహణ ద్వారా రూ. 2,88,800,వాహన పూజల ద్వారా రూ.13,200, వీఐపీ దర్శనం ద్వారా రూ.2,10,000,ప్రచారశాఖ ద్వారా రూ. 27,000,పాతగుట్ట ద్వారా రూ.52,090,కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 5,50,000 వచ్చిందని వెల్లడించారు.
యాదఋషి నిలయం ద్వారా రూ.1,00,684,సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,41,580,శివాలయం ద్వారా రూ.14,100, పుష్కరిణీ ద్వారా రూ.1,350,ప్రసాదవిక్రయం ద్వారా రూ.13,76,350,శాశ్వత పూజలు ద్వారా రూ.40,000,కళ్యాణ కట్ట ద్వారా రూ.1,13,500, కైంకర్యముల ద్వారా రూ. 200, అన్నదానం ద్వారా రూ.1,29,423,లీజిస్ లీగల్ ద్వారా రూ. 68,300 ఆలయానికి ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.