న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా సీఈవో పీఆర్ సోమసుందరం తన పదవి నుంచి వచ్చే ఏడాది వైదొలగబోతున్నారు. జనవరి 2013లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా చీఫ్గా నియమితులైన ఆయన పదేండ్లుగా విధులు నిర్వహించారు. అయినప్పటికీ అతని స్థానంలో నూతన వ్యక్తిని నియమించేవరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఈ దశాబ్దకాలంలో ఆయన దేశీయ గోల్డ్ మార్కెట్ నిర్మాణాత్మక సంస్కరణలు, హాల్మార్కింగ్, డిజిటల్ గోల్డ్ కొనుగోలు చానెల్ వంటి విప్లవాత్మక నిర్ణయాల్లో ఆయన పాలుపంచుకున్నారు. సోమసుందరం మాట్లాడుతూ.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇండియా గోల్డ్ ఇండస్ట్రీపై గత పదేండ్లుగా సేవలు అందించినట్టు, ప్రస్తుతం రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.