జనగామ మండలం గానుగుపహాడ్కు చెందిన దళిత మహిళ గుర్రం ఉష సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతుబంధు, నిరుపేదలకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, కేసీఆర్ కిట్లు, దళితబంధు పథకాలను గుర్తుచేస్తూ ముగ్గువేశారు. అందులో కేసీఆర్ చిత్రపటం వేసి అందరినీ ఆకట్టుకొన్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు. – జనగామ రూరల్