జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ముస్కు శ్యాం సుందర్ గార్డెన్ లో 28 మంది కి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం వల్ల నిరుపేదల ఇళ్లల్లో ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి లో సీటీ స్కానింగ్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.