భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెండ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మొండి కట్ట గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పాల్వంచ మండలం, మందరికల పాడు గ్రామం నుంచి పెండ్లికి వెళ్తున్న ట్రాక్టర్.. మొండి కట్ట గ్రామం దగ్గర మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.