సూర్యాపేట : నిన్నటి ఉద్యమ నేత, నేటి అభివృద్ధి ప్రదాత స్వయంగా ఇండ్లకే వచ్చి కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్ లు అందజేస్తుంటే అక్కడి మహిళలు పట్టారని సంతోషంతో తబ్బిబుబ్బి పోయారు.
పేదల ఇండ్లలో జరుగుతున్న పెండ్లిళ్లకు ఆడపడుచు కట్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. వాటి ఫలాలను నేరుగా తమ చెంతకే సదరు నేత చేరవేస్తుండటంతో నారీ లోకం జన నేతకు నీరాజనం పట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని 13 వార్డులలోనీ 86 మందికి కళ్యాణాలక్ష్మి/,షాదీముబారక్ పథకం కింద మొత్తం 86 లక్షల 1,376 రూపాయలను విద్యుత్ శాఖ మంత్రి రెడ్డి మంజూరు చేయించారు.
అక్కడితో ఆగకుండా మంత్రి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేశారు. పేరుపేరున పలకరించి వారి యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, మంత్రే స్వయంగా వచ్చి చెక్కులు అందజేయడంతో లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోయారు.