హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈ-పాస్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు ద్వారా పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థుల డాటా ఇవ్వాలని కేంద్రాన్ని త్వరలో కోరునున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకునే క్రమంలో ఎదురైన కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథకం ప్రచురితమయ్యింది.
దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం శనివారం వివరణ ఇచ్చింది. ఈ విషయాన్ని లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నది. పోస్ట్మెట్రిక్ స్కాలర్ దరఖాస్తుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు జారీచేసిన పదోతరగతి సర్టిఫికెట్లనే ఈ-పాస్లో అనుమతిస్తున్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు నుంచి పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థుల దరఖాస్తులు ఈ-పాస్ స్వీకరించడంలేదు. ఈ-పాస్ అనుమతి లేకుండా స్కాలర్షిప్ ఇవ్వరు.
ఈ అంశంపై ‘నమస్తే తెలంగాణ’ వార్త ప్రచురించగా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి త్వరలోనే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న టెన్త్క్లాస్ బోర్డు మాదిరిగానే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల నుంచి కూడా వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఈ-పాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు గడువు ఉన్న నేపథ్యంలో తమకు న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.