Minister Dayakar Rao | ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వడగండ్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ మేరకు వెంటనే రంగంలోకి దిగి నష్టాన్ని అంచనా వేయాలని కలెక్టర్లు, ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఏయే ప్రాంతాల్లో వడగండ్లు కురిశాయి? ఏ మేరకు పంట నష్టం జరిగింది? ఎంత మంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది? తదితర వివరాలను అధికారులను ఆరా తీశారు.
అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. శనివారం సాయంత్రం భారీగా ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించిందంటూ మంత్రి విచారం వ్యక్తం చేశారు. వడగండ్ల వానలకు నష్టపోయిన రైతాంగం ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీఎం కేసీఆర్తో మాట్లాడానని, పంట నష్టాల అంచనాలు వేశాక, తగిన విధంగా పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి, పంట నష్టాల అంచనాలు వేయడంతో పాటు రైతులకు ధైర్యం చెప్పాలని సూచించారు.