హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని వందశాతం రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో తిరిగి ఫార్మా సిటీనే పునరుద్ధరిస్తామని తేల్చిచెప్పారు. కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా సిటీకే అనుమతులు ఇచ్చింది అని గుర్తుచేశారు. నిబంధనల ప్రకారం.. ‘ప్రాజెక్టులో 75 శాతం ఫార్మాసిటీ ఉండి, దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలైన ఎడ్యుకేషన్, హౌసింగ్ వంటివి మిగతా 25 శాతంలో రావాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పూర్తిగా తారుమారు చేస్తున్నది. 75 శాతం రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసి, కేవలం 25 శాతమే ఫార్మా రంగానికి పరిమితం చేయాలని చూస్తున్నది. ఇది చట్ట ప్రకారం ఎంతమాత్రం చెల్లదు. ప్రాజెక్టులో ఇలాంటి డీవియేషన్లు (నిబంధనల ఉల్లంఘనలు) ఉంటే, సేకరించిన రైతుల భూములను తిరిగి వారికే ఇచ్చేయాలని పార్లమెంట్ చట్టం స్పష్టంగా చెప్తున్నది. ఇది నా మాట కాదు. చట్టం చెప్తున్న సత్యం’ అని కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్లో గురువారం ఎన్నారైల సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ.. ఇటీవల హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా.. తాము ఫార్మా సిటీని కొనసాగిస్తున్నామని రేవంత్ ప్రభుత్వమే స్వయంగా కోర్టుకు అఫిడవిట్ సమర్పించిందని తెలిపారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఫార్మాసిటీ పక్కకు
ఫార్మాసిటీ పూర్తయితే బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందనే కుళ్లు రాజకీయ ఉద్దేశంతోనే రేవంత్ సరార్ దీన్ని పకనబెట్టిందని హరీశ్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూ ములు పంచిపెట్టి వెనుకదారిలో పెద్ద లబ్ధి పొందాలనే సెచ్ వేశారు’ అని ఆరోపించారు