హైదరాబాద్ : కృష్ణా జలాలపై పార్లమెంట్లో గళం వినిపిస్తామని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్పై న్యాయ నిపుణులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారని ఆయన తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కృష్ణా జలాలను అక్రమంగా తీసుకెళ్తున్నదని ఎంపీ బడుగుల మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీ జల దోపిడీని అడ్డుకొని తీరతామని ఎంపీ బడుగుల స్పష్టం చేశారు. కృష్ణానదిలో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో చుక్క నీటిని సైతం వదిలి పెట్టేది లేదని ఆయన పేర్కొన్నారు.