మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్ వంటి ఎన్నో అభివృద్ధి పనులతో ముందుకు తీసుకెళ్లామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి సీఎం కేసీఆర్, మహబూబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ను గెలిపించాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు కావస్తున్నది. కానీ, ప్రతిపక్షాలకు ఇప్పటికీ కూడా అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థులను ఢిల్లీ నిర్ణయిస్తుందని, ఆ రెండు పార్టీలు ఓట్లు అడగాలంటే ఢిల్లీ నుంచి నాయకులు రావాలి. ఇటీవల ములుగులో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో లోని హామీలను కరోనా కష్ట కాలంలో కూడా అమలు చేశాం ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో కూడా పూర్తిగా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఓ దొంగ, ఓ బ్రోకర్. ఇతడు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ సర్వనాశనం అవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు, తదితరులు పాల్గొన్నారు.