హైదరాబాద్ : అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తామని క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని లాల్ బహదూర్ మినీ స్టేడియంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన చీర్స్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొని ఒలింపిక్స్ జ్యోతిని ప్రముఖ మాజీ హాకీ ఆటగాడు, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్ నుండి అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తున్నా రన్నారు.
అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా పాలసీని రూపొందించటానికి క్యాబినెట్ సబ్ కమిటీ ని నియమించారన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించబోతున్నామని పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 30 పైగా స్టేడియాల నిర్మాణం పూర్తి చేశామని వివరాలను వెల్లడించారు.
అలాగే ఒలింపిక్స్ లో పతకాలు సాధించే ఆటగాళ్లు కు నగదు పురస్కారాన్ని గతంలో కంటే ఎక్కువగా అందిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి , దేశం నుంచి ఒలింపిక్స్ వెళ్తున్న ఆటగాళ్లకు మంత్రి చీర్స్ చెప్పారు. ప్రతి ఆటగాడు తన శక్తి సామర్థ్యాలను కూడగట్టుకొని పతకాలు సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని మర్థా్ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఇంచార్జ్ అధ్యక్షుడు సముద్రాల వేణుగోపాల చారి, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్, శాట్స్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?