వరంగల్ : వరంగల్ నగరంలోని అజంజాహి మిల్స్ ప్రాంగణంలో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హన్మకొండలోని రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌస్లో సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ హరిత, రెవెన్యూ అధికారులతో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం భవన నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరంగల్ రూరల్ జిల్లా స్థానంలో ఇటీవల వరంగల్ జిల్లా ఏర్పడి నందున జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి కావాల్సిన భూమిని వెంటనే సేకరించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. అందువల్ల వెంటనే సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి భవన నిర్మాణ నిమిత్తం ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
భూసేకరణలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో మహేందర్ జీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Nalgonda : సీఎం కేసీఆర్ పూడిక తీసిన చెరువుకు జలకళ
Pfizer vaccine: న్యూజిలాండ్లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి
రాష్ట్రం వ్యాప్తంగా దంచికొట్టిన వాన