నిజామాబాద్ : బాన్సువాడ యోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు, గుంటగుంటకు సాగునీరు, ప్రతి పేదవారికి సొంత ఇల్లు నిర్మించాలన్నదే తన ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. కోటగిరి మండలం హంగర్గఫారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి మాట్లాడారు. రూ.150 కోట్లతో నిజాంసాగర్ కాలువలను ఆధునీకరించాం.
చివరి ఆయకట్టు వరకు ఉన్న D-28 కాలువను రూ. 15 కోట్లతో లైనింగ్ చేయించామన్నారు. హంగర్గ ఫారంలో 40 ఇండ్లను ప్రారంభించామని, మరో 35 ఇండ్లకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదలందరికి సొంతిం ఇంటి కలను నెరవేరుస్తామన్నారు.