మెండోరా/భీమ్గల్/మోర్తాడ్/కమ్మర్పల్లి/ సెప్టెంబర్ 14: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు అని పలు కుల సంఘాల నేతలు ప్రకటించారు. గురువారం మెండోరా మండలం బుస్సాపూర్కు చెందిన ఒడ్డెర, విశ్వబ్రాహ్మణ సంఘాలకు చెందిన 25 కుటుంబాల వారు, భీమ్గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామానికి చెందిన శాలివాహన సంఘం సభ్యులు 46 మంది,
మోర్తాడ్ మండలం తిమ్మాపూర్లో విశ్వబ్రాహ్మణ సంఘం, వడ్డెర సంఘం, పాలెం గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన 30 మంది ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ తీర్మాన ప్రతులను స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు.