రవీంద్రభారతి, ఆగస్టు 28: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలుపునకు కృషి చేస్తామని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. శనివారం సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పోలాడి మాట్లాడారు. విద్యావేత్త, నిరుపేద యువకుడు, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న గెల్లుకు మద్దతుగా ఓసీ సమాఖ్య ఆధ్వర్యంలో విస్త్రత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సమాఖ్య ప్రతినిధులు పెండ్యాల కేశవరెడ్డి, గోపు జైపాల్రెడ్డి, చెన్నమనేని పురుషోత్తంరావు, చందుపట్ల నర్సింహారెడ్డి, గంగవరపు రామకృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.