మహబూబ్ నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని మహబూబ్నగర్ అఖిల భారత యాదవ సంఘం నాయకులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
జిల్లాను ఏడు సంవత్సరాల కాలంలో ఊహించనంతగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి చేశారన్నారు.
రాత్రనక, పగలనక తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడిపై ఈ విధమైన చర్యలకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. కార్యక్రమంలో గోపాల్ యాదవ్, సాయిలు యాదవ్, శాంతయ్య యాదవ్, కోట్ల నర్సిములు యాదవ్,పెద్ద గొల్ల నర్సిములు యాదవ్, పాపరాయుడు యాదవ్ ,శ్రీనివాస్ యాదవ్ గారు, రాజు యాదవ్ గారు, చందు యాదవ్, నర్సింహ యాదవ్, యాదవ్, సుజిత్ యాదవ్, అనిల్ యాదవ్, గణేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.