‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపు మారుతున్నదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని కాంగ్రెస్ నేత, వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సర్పంచ్ సూరప్ప ప్రశంసలు కురిపించా రు. గత ప్రభుత్వాలు మాటలు చెప్పేవని, కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపుతున్నదని చెప్పారు. గతంలో గల్లీ గల్లీకి చెత్త కుప్పలు కనిపించేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు.
గతంలో శ్మశానవాటికలు లేక అంతిమసంస్కారాలకు నరకం ఉండేదని, నేడు ఊరికో వైకుంఠధామం నిర్మాణంతో ఇబ్బందులు తొలిగాయని చెప్పారు. గ్రామానికో ట్రాక్టర్ కొనుగోలుతో పారిశుద్ధ్య సమస్యలకు చెక్ పెట్టడంతోపాటు గ్రామ పంచాయతీకి ఆదాయం దక్కుతుందన్నారు. తాము ఏది కోరినా కాదనకుండా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మంజూరు చేస్తున్నారని, ఆయనకు రుణపడి ఉంటామని చెప్పారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా 10 లక్షలు మంజూరైతే అదనంగా మరో 10 లక్షలు ఎంపీపీ మంజూరు ఇవ్వడంతో సీసీ రోడ్లు వేయించామని వివరించారు.