మేడ్చల్ మల్కాజిగిరి : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంగా మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని గోధుమకుంటకు చెందిన బండ మహర్షి ప్రసాద్కు మంజూరైన రూ.35వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు బుధవారం మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదలకు వైద్య సేవలు భారం కొవొద్దని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మేడ్చల్ జిల్లాలో దరఖాస్తు చేసుకొన్న అందరికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని అర్హులైన వారందరికి అందిస్తున్నామన్నాని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.