సిద్దిపేట అర్బన్, నవంబర్ 16 : విద్యుత్తు అనేది చాలా ముఖ్యమైన వనరు అని, దాన్ని దుర్వినియోగం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు సూచించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లో ‘జిల్లా విద్యుత్తు వినియోగదారులతో నిర్వహించిన ముఖాముఖి’లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 24లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయని.. వాటిలో ఏ ఒక్కదానికీ మీట ర్లు లేవన్నారు. రాష్ట్రంలో ఉన్న 3 లక్షల వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లలో 6 వేల ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించి ఒక అంచనా వేసి డిస్కమ్లకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నదన్నారు. ప్రభు త్వం రూ.14,745 కోట్లను బడ్జెట్లో కేటాయించి పంపిణీ సంస్థలకు చెల్లిస్తున్నదని తెలిపా రు. రాష్ట్రంలో వినియోగిస్తున్న విద్యుత్తు.. దేశ ప్రజలు వినియోగిస్తున్న దానికంటే రెండింతలుగా ఉన్నదన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి అని ఆయన పేర్కొన్నారు. వేసవిలో రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్తు అందించాలనే లక్ష్యంతో నెలకు రూ.3,800 కోట్లు అదనంగా వెచ్చించి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిందన్నారు.