నందికొండ, అక్టోబర్ 7: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. నందికొండ పొట్టిచెలిమ సమీపంలోని ఎడమకాల్వ హెడ్రెగ్యులేటర్ వద్ద ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ శనివారం పూజలు నిర్వహించి నీటి విడుదలను ప్రారంభించారు. 9 ఏండ్లలో వరుసగా రెండు పంటలకు నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్లో వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు సమృద్ధిగా లేకపోయినా.. ఎడమ కాల్వ కింద పొలాలు ఎండిపోకూడదని నీటిని విడుదల చేసినట్టు తెలిపారు. రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 10 రోజులపాటు 5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్టు వివరించారు. మొదటి జోన్ వరకు నీరు అందుతుందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. 500 క్యూసెక్కులతో ప్రారంభించామని, క్రమంగా పెంచుతూ 4 వేల క్యూసెక్కుల వరకు వదులుతామని ఎన్ఎస్పీ ఎస్ఈ నాగేశ్వర్రావు తెలిపారు.