మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు (Manakondur) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగడాని నీళ్లు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలోని బావి నుంచి పీహెచ్సీకి విద్యుత్తు మోటారుతో తాగడానికి, ఇతర అవసరాలకు నీటిని సరఫరా చేస్తున్నారు.
అయితే నెల రోజుల క్రితం ఆ మోటారు వైరును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తారు. దీంతో కొత్తది ఏర్పాటుచేయక పోవడంతో దవాఖానకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రోగులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులే తాగునీటి క్యాన్లను కొనుగోలు చేసుకొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.