పెద్దపల్లి : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారి జలసిరి సంతరించుకుంది. రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు చేరుకోవడంతో బుధవారం మధ్యాహ్నం ఎల్లంపల్లి వైపు రెండు గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని వదిలారు.
కాగా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175, లెవల్ 48 మీటర్లకు చేరుకోవడంతో ఎగువ ప్రాంతాల నుంచి టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ముందస్తుగా రెండు గేట్ల ద్వారా నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. నీటి విడుదలపై అధికారులను ముందస్తు సమాచారం అందించి అప్రమత్తం చేశామని, గోదావరి పరివాహక ప్రాంతాల కు ప్రజలు ఎవరు వెళ్లుద్దు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
350 కిలోల గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు
మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
కోహ్లిని మించిన బాబర్ ఆజం.. పాకిస్థాన్ కెప్టెన్ కొత్త రికార్డు
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు అన్నదమ్ముల మృతి
కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం