నాగర్కర్నూల్ : జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. బిజినపల్లి మండలం సల్కరిపేట గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ భూ సమస్య పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బలవన్మరణానికి యత్నించింది. తన భర్త చనిపోవడంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకునేందుకు బంధువులు ప్రయత్నిస్తన్నారని జ్యోతి ఆరోపించింది.
రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల తీరుకు నిరసనగా నిప్పు అంటించుకునే సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీగార్డు, ఉద్యోగులు అడ్డుకుని అదనపు కలెక్టర్ చాంబర్ గదిలోకి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
కోహ్లిని మించిన బాబర్ ఆజం.. పాకిస్థాన్ కెప్టెన్ కొత్త రికార్డు
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు అన్నదమ్ముల మృతి