హైదరాబాద్ : రాష్ర్ట డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ లొంగిపోయారు. ప్రస్తుతం రంజిత్ దండకారణ్యం బెటాలియన్ కమిటీ చీఫ్గా కొనసాగుతున్నాడు. కాగా రెండు సంవత్సరాల క్రితం తండ్రి రామన్న ఆనారోగ్య సమస్యతో చనిపోయిన విషయం తెలిసిందే. రావుల రంజిత్ కూడా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన లొంగిపోయాడు. కాగా రంజిత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ముగ్దుర్ మండలం బెక్కల్ గ్రామం. మరి కాసేపట్లో రావుల రంజిత్ను పోలీసులు మీడియా ముందుకు తీసుకురానున్నారు.