CM Revanth: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వెంట పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, కొండా సురేఖ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కూడా ముఖ్యమంత్రితో కలిసి సీతా సమేత రామచంద్ర స్వామికి పూజలు చేశారు.
అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి, మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్లిన సీఎం, మంత్రులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు.
#WATCH | Telangana CM Revanth Reddy offered prayers at the Sree Seetha Ramachandraswamy Temple in Bhadrachalam pic.twitter.com/TZQKWuqhPI
— ANI (@ANI) March 11, 2024