హనుమకొండ చౌరస్తా, మే 4: విద్యా, పాఠ్యేతర కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన వరంగల్ నిట్ విద్యార్థులకు ఎండోమెంట్ అవార్డులను అందజేశారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 29 బంగారు పతకాలు, 16 నగదు పురసారాలను వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అందజేశారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రత్నాల స్పందన రెండు బంగారు పతకాలు, 3 నగదు బహుమతులు, సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అల్లె మధురిత 2 బంగారు పతకాలు, ఒక నగదు బహుమతి గెలుచుకున్నారు.