హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో మరో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ కొలువుదీరనున్నది. ఈ నెల 17న దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ వస్త్ర పరిశ్రమ నిర్మాణ పనులకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు. 298 ఎకరాల్లో రూ.840 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 11,700 మందికి, పరోక్షంగా మరో 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సింథటిక్ జాకెట్స్, బూట్స్, ట్రాక్ సూట్స్తోపాటు ట్రెక్కింగ్కి ఉపయోగించే ఇతర వస్ర్తాలు ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు.
రోజకు 2.5 మిలియన్ల డ్రెస్సులు
కేఎంటీపీలో కేరళకు చెందిన కిటెక్స్ సంస్థ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నది. ఈ సంస్థ ముందుగా రాష్ట్రంలో రూ.2,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినా, పరిశ్రమ అనుకూల విధానాలు నచ్చి తమ పెట్టుబడిని రూ.3 వేల కోట్లకు పెంచింది. ఈ సంస్థ 28 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం కేఎంటీపీతోపాటు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో కిటెక్స్కు భూములు కేటాయించింది. కేఎంటీపీలో రూ.1,000 కోట్లు, సీతారాంపూర్లో రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకోగా, రూ.600 కోట్లతో పిల్లల సాక్స్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నది. సీతారాంపూర్లో నిర్మాణ పను లు కొనసాగుతున్నాయి. ఇవి ప్రారంభమైతే రోజుకు 2.5 మిలియన్ల పిల్లల దుస్తులు ఉత్పత్తి కానున్నాయి.
కేఎంటీపీ విశేషాలు: