వరంగల్, జనవరి 17: స్మార్ట్సిటీలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన నర్చరింగ్ నైబర్హుడ్ చాలెంజ్ పోటీలో గ్రేటర్ వరంగల్ టాప్టెన్లో నిలిచింది. దేశవ్యాప్తంగా 63 నగరాలు పోటీపడగా, మొదటి పది నగరాల్లో వరంగల్కు చోటుదక్కిం ది. 2020 నవంబర్లో 63 నగరాలు ప్రతిపాదనలు పంపగా, గతేడాది ఫిబ్రవరిలో కేంద్రం 25 నగరాలను ఎంపిక చేసింది. చాలెంజ్లో భాగంగా హనుమకొండ శ్రీదేవిమాల్ పక్కన ఉన్న అంగన్వాడీ కేంద్రా న్ని ఆధునీకరించారు. ఫుట్పాత్లు, చిల్ట్రన్ పార్కును అనుసంధానం చేసి పిల్లలకు ఇంటరాక్టివ్ గేమ్స్ అందుబాటులోకి తెచ్చారు. సైక్లింగ్, వాకింగ్, పెయింటింగ్, జుంబా డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. బాలసముద్రంలో పెట్ పార్కును ఏర్పాటుచేసి పెంపుడు కుక్కలకు ఆట వస్తువులను ఏర్పాటుచేసిన ప్రతిపాదనలను గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సమర్పించింది. వీటిని పరిశీలించిన కేంద్రం టాప్టెన్ నగరాలలో చోటు కల్పించింది. ఈ పోటీలో గెలుపొందిన నగరాలకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించనున్నది. నర్చరింగ్ నైబర్హుడ్ చాలెంజ్లో టాప్టెన్లో నిలవడం పట్ల గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి హర్షం వ్యక్తంచేశారు.
ఏమిటీ చాలెంజ్..?
శిశువులు, సంరక్షకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిందే నైబర్హుడ్ చాలెం జ్. మూడేండ్ల వ్యవధిలో పరిసర ప్రాంతాలను ఆధునీకరించాలి. స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా దీన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.