నిజామాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ (Nizamabad), బోధన్లో (Bodhan) కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగిన యువకుల బలిదానాలకు మీరే బాధ్యత వహించాలని, క్షమాపణలు చెప్పాల్సిందే.. ముక్కు నేలకు రాయాల్సిందే నంటూ రాహుల్ గాంధీ ఫొటోలతో పోస్టర్లు అంటించారు.
కర్ణాటకలో కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి నిరుద్యోగుల గోస, ఉద్యోగాలు కాదు.. ఉరితాళ్లే మిగిలాయంటూ రాహుల్, రేవంత్ రెడ్డి ఫొటోలతో కూడిన పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అంటించారు. బళ్లారిలో జీన్స్ పరిశ్రమలకు విద్యుత్ కోతలకు సంబంధి పత్రికల్లో వచ్చిన కథనాలను పేర్కొన్నారు. తెలంగాణమా.. తస్మాత్ జాగ్రత్త.. కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు.