హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్ట్, కేజీబీవీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెం డు నెలల వేతనాలు పెండింగ్లోనే ఉన్నా యి. నవంబర్, డిసెంబర్ వేతనాలు అం దకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
సంక్రాంతిలోగా జీతాలు ఇ వ్వాలని కోరుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలో 22 వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ప్రాజెకు కేంద్రం రూ.224 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ.149 కోట్లు. తొలి విడతగా కేంద్ర వాటా రూ.66 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర వాటా రూ.84 కోట్ల చొప్పున రూ.150 కోట్లను విడుదల చేయాల్సి ఉన్నది.