మంచిర్యాల: జిల్లాలోని కన్నెపల్లిలో దారుణం జరిగింది. తహశీల్దార్ కార్యాలయంలోనే ఓ వీఆర్ఏ (VRA) హత్యకు గురయ్యాడు. దుర్గం బాబు అనే వీఆర్ఏని కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో దుండగులు హత్యచేశారు. సోమవారం ఉదయం రక్తపుమడుగులో పడి ఉన్న దర్గం బాబును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిసరాలను పరిశీలించారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. దుర్గం బాబు కొత్తపల్లి వీఆర్ఏగా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.