హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఓటరు నమోదులో భాగంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఏ)లపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలోని అర్హులైన పౌరులందరికీ ఓటుహక్కు కల్పించే పనిలో నిమగ్నమైంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ, నగర శివారులో 4500 ఆర్డబ్ల్యూఏలు ఉన్నాయని గుర్తించారు. గత నెల 7న ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ ప్రారంభించారు.
ఒక నోడల్ అధికారి, 10 బీఎల్వోలతో కూడిన 757 బృందాలను సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులు 4 జిల్లాల్లో ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులకు ఆన్లైన్ రిఫరెన్స్ నంబర్తో రసీదు అందించారు. జీహెచ్ఎంసీ, చుట్టుపక ల 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 14.57 లక్షల గృహాలను సందర్శిస్తూ 4,605 ఆర్డబ్ల్యూఏల్లో క్యాంపులు నిర్వహించారు. ఓటర్ల నమోదు కోసం 37,588 దరఖాస్తులు, అసెంబ్లీ నియోజకవర్గంలో, వెలుపల ఓటరును మార్చడానికి, సవరణలకు 13, 319 దరఖాస్తులను సేకరించారు. వీటికి 27 నాటికి ఎన్నికల సంఘం పరిష్కంచనన్నది.