హైదరాబాద్, మార్చి29 (నమస్తే తెలంగాణ): వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (వాలంతరి) డైరెక్టర్ జనరల్ రమేశ్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. రమేశ్ మృతిపై సాగునీటిశాఖ అధికారులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సాగునీటిపారుదలశాఖ మహబూబ్నగర్ చీఫ్ ఇంజినీర్గా సేవలు అందించిన రమేశ్ ఆ తర్వాత వాలంతరీ డీజీగా నియమితులయ్యారు. డీజీ రమేశ్ మృతిపై సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, నీటిపారుదలశాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్బొజ్జ సంతాపాన్ని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.