గజ్వేల్, మార్చి 5: అందరూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న కలలు కంటారని, కానీ, సీఎం కేసీఆర్ దానిని నిజం చేసి చూపించారని మహారాష్ట్ర ఫుణె అధికారుల బృందం కొనియాడింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్, కోమటిబండలోని మిషన్భగీరథ సంప్హౌజ్ను ఆదివారం ఫుణెకు చెందిన న్యాయవాదులు రవిరాణాసింగ్, విలాస్ సర్దేశ్వర్, ఇంజినీర్ కిశోర్ సర్దేశ్వర్ సందర్శించారు.
గజ్వేల్ పట్టణ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ సమీకృత మార్కెట్ నిర్మాణం గురించి వారికి వివరించారు. కోమటిబండ సంప్హౌస్, రైతు వేదికను బృందం సందర్శించింది. తెలంగాణ సీఎం కేసీఆర్లాంటి నాయకుడే దేశానికి అవసరమని బృందం సభ్యులు పేర్కొన్నారు .