హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ)/ఉప్ప ల్: విశ్వకర్మల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారిలో గుండె నిబ్బరం నింపింది ముఖ్యమంత్రి కేసీఆరేనని అసెంబ్లీ మా జీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. విశ్వకర్మ ఆత్మగౌరవ భవనం జ్ఞానాలయంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. ఉప్పల్ భగాయత్లో ప్రభు త్వం కేటాయించిన ఐదెకరాల్లో ఆదివారం భగవాన్ విశ్వక ర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా మహాయజ్ఞం వైదికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణుల్లో ఆత్మవిశ్వాసం నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత దాసోజు శ్రవణ్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేం ద్ర, ట్రస్ట్ చైర్మన్ వెంకటాచారి, యజ్ఞ నిర్వాహకులు బలవంతచారి, విశ్వకర్మ ప్రతినిధులు గణేశాచారి, సుందర్, దానకర్ణాచారి, కృష్ణమాచారి, బ్రహ్మచారి, వెంకటాచారి, సతీశ్చారి, లక్ష్మణాచారి, కృష్ణమోహన్చారి పాల్గొన్నారు.