కమలాపూర్, సెప్టెంబర్ 14: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డిని గెలిపించుకుంటామని విశ్వబ్రాహ్మణులు ప్రకటించారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ కుల పెద్దలు, యువకులు, మహిళలు మూడు వందల మంది బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు సమావేశమై వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కౌశిక్రెడ్డిని గెలిపించుకుంటామని తీర్మానం చేసి ఆ ప్రతిని ఆయనకు అందజేశారు. ఉప ఎన్నికల్లో గెలిచి ఏడాది కావస్తున్నా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తమను ఏనాడు పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి వారికి హామీ ఇచ్చారు.