వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ సౌతిండియా ఆపరేషన్స్ హెడ్ జయ అమిత్ మిత్రా
బంజారాహిల్స్, మే 17: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా ఆంక్షలు సడలించడంతోపాటు రాకపోకలపై నియంత్రణలను ఎత్తివేసిన నేపథ్యంలో విద్యార్థులు, పర్యాటకుల వీసాల జారీ ప్రక్రియ వేగవంతమైందని వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ సౌతిండియా ఆపరేషన్స్ హెడ్ జయఅమిత్ మిత్రా చెప్పారు.
బంజారాహిల్స్లోని తాజ్ బంజారా హోటల్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం వివిధ దేశాల వీసాల జారీ, ప్రాసెసింగ్ తదితర అంశాలపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రెండేండ్లుగా ప్రపంచంలోని పలు దేశాల్లో విదేశీయుల రాకపై ఉన్న ఆంక్షలు దాదాపుగా తొలిగిపోవడంతో వీసాల మంజూరు ప్రక్రియ ఊపందుకున్నదని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 133 శాతం పెరుగుదల నమోదైందని తెలిపారు. ప్రయాణికులు వీసాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కరోనా తర్వాత అమెరికా, యూకే, యూరప్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు.