హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ) : పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ రిపోర్టు న్యాయస్థానాల్లో నిలువదని ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన రోజే చెప్పామని ఆయన గుర్తుచేశారు. కమిటీ విచారణ సందర్భంగా సహజ న్యాయసూత్రాలు పాటించలేదని విమర్శించారు.
కేవలం ఎస్సారెస్పీ తప్ప గోదావరి నదిపై కాం గ్రెస్, టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని బోయినపల్లి విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరిపై పది బరాజ్ల వరకు నిర్మించి వందల టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నామని పే ర్కొన్నారు. కేసీఆర్ హ యాంలో మిడ్ మానేరులో ఎండాకాలంలో నీ ళ్లు కనిపించేవని, ఇప్పుడు మాయమయ్యాయని విమర్శించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉంటుందనే హెచ్చరికలతో రేవంత్రెడ్డి మేడిగడ్డకు కదిలారని మండిపడ్డారు. మేడిగడ్డను రిపేర్ చేయకపోతే ఉత్తర తెలంగాణకు తాగునీళ్లు ఉండవని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్రెడ్డికి తిట్ల పురాణం తప్ప ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ కుర్చీకి సొంత పార్టీ నేతలతోనే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఆల్మట్టి ప్రాజెక్టు విస్తరణ, భూసేకరణ కోసం రూ.లక్ష కోట్లు కేటాయించిందని వినోద్కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, లీగల్ సెల్ ప్రతినిధులు కల్యాణ్రావు, కిరణ్, వేణుగోపాల్రావు, ప్రవీణ్ పాల్గొన్నారు.