వరంగల్ రూరల్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పితృవియోగం కలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని కలిసి పరామర్శించారు. ఆయన తండ్రి స్వర్గీయ రాజిరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు ఋణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుడిమల్ల రవి కుమార్, జీడబ్ల్యూఎంసీ 45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ తదితరులు పెద్ది సుదర్శన్రెడ్డిని పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి(92) అనారోగ్యంతో గడిచిన బుధవారం మృతిచెందారు.