రాజన్న సిరిసిల్ల : శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమిపై 20 రోజులపాటు అధ్యయనం చేసాం. బీఆర్ఎస్( BRS )పార్టీకి పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ పార్టీకి కార్యకర్తలే. ప్రజల పట్ల ప్రేమాభిమానంతో నడుచుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) అన్నారు. మంగళవారం వేములవాడ నియోజకవర్గస్థాయి కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
మన టార్గెట్ కరెక్టుగా ఉంటే విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. గులాబీ పార్టీ పుట్టినరోజు ఉంటదా పోతదా అనే పరిస్థితిలో ఉండేది. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ సాధించామన్నారు. అంతేకాదు 24 గంటల కరెంట్ సరఫరా,120 అంతస్తుల పైన గడ్డమీద ఉన్న తెలంగాణకు గోదావరి నీటిని తరలించామని పేర్కొన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చామని గుర్తు చేశారు. మీరందరూ కలిసి పనిచేస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమన్నారు.
దేశంలో గట్టి పోటీ లేని ప్రతిపక్షం ఉన్నందునే మోదీ గెలుస్తామని చెబుతున్నారు. అతి విశ్వాసంలో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా బలమైన పార్టీగా గులాబీ పార్టీ ఉందని చెప్పారు. మనకున్న శక్తి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు లేవన్నారు.
మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ను సందర్శించి నిజాలను ప్రజలకు వివరిద్దామన్నారు. నేనొక కార్యకర్తగా, నాయకు డిగా మీకు అందుబాటులో ఉంటాను. ఫోన్ చేసిన మాట్లాడతానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చే ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలుపొందాలే పని చేయాలని పిలుపునిచ్చారు.