హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, అధికారిక కార్యక్రమాల పట్ల రాజకీయ దురుద్దేశాలను ఆపాదించడం సంసా రం కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హితవు పలికారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించేవిధంగా రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ ప్రధానిని, పలువురు కేంద్ర మంత్రులను కలిశారని వివరించారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ప్రథమ కర్తవ్యమని స్పష్టంచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వారిని విపక్ష ముఖ్యమంత్రులు కలువలేదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో వారంపాటు మకాం వేసి, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్షా, గజేంద్రసింగ్ షెకావత్, నితిన్ గడరీలను కలిసి రాష్ట్ర అభివృద్ధి పనులపై చర్చించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ఐపీఎస్ క్యాడర్పై కేంద్రం సమీక్షించాలని, కాకతీయ సమీకృత టెక్స్టైల్ పార్ను ఏర్పాటుచేయాలని, హైదరాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయాలని, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు, కరీంనగర్లో ట్రిపుల్ఐటీ, హైదరాబాద్లో ఐఐఎం, రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పాలని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలని కోరిన సంగతిని రేవంత్రెడ్డి గమనించకపోవడం దురదృషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ ప్రధానితోపాటు కేంద్ర మంత్రులకు అందజేసిన 15 వినతిపత్రాల జాబితాను విడుదలచేశారు. వాటిని రేవంత్ ఒకసారి చదువుకుంటే మంచిదని సూచించారు.